రెండు రోజుల క్రితం హైదరాబాద్ గచ్చిబౌలి వద్ద గల బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్పై నుంచి ఒక కారు అదుపు తప్పి క్రిందన రోడ్డుపై పడినప్పుడు సత్యవేణి అనే మహిళ దాని క్రింద నలిగి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వెంటనే స్పందించిన మున్సిపల్ శాఖామంత్రి కేటీఆర్ చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేశారు. లీ అసోసియేట్స్ అనే ప్రైవేట్ సంస్థ ఆ కమిటీతో కలిసి బయోడైవర్శిటీ ఫ్లై ఓవర్ డిజైన్లో ఏమైనా లోపాలున్నాయా? ఫ్లై ఓవర్పై ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి? వాటి నివారణకు ఎటువంటి చర్యలు చేపట్టాలి? తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. దాని ఆధారంగా ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుంది.