జనవరిలో కొలువుల జాతర!

SMTV Desk 2019-10-29 17:08:02  

జగన్ మోహన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రం లో సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చి అయిదు నెలలే అయినా పెను మార్పులు తీసుకువచ్చారు. దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలతో నిరుద్యోగుల మొహాల్లో వెలుగుని నింపాడు. తండ్రిలాగానే తనయుడు కూడా అదే తరహాలో పేరు తెచ్చుకుంటున్నాడు. అయితే ఎన్నో వరాలు ఇచ్చిన జగన్ నిరుద్యోగులకు మళ్ళీ ఇంకో వరాన్ని ప్రసాదించనున్నాడు. జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నాడు. 44,941 పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టనున్నారు.

నిరుద్యోగుల కోసం మరో నియామక ప్రక్రియను చేపట్టింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. పోలీస్ డిపార్ట్ మెంట్ లో 13,591 పోస్టులు, డి.ఎస్సి లో 20,000 పోస్టులు, గ్రూప్-2 లో 1000 పోస్టులు, గ్రూప్-4 లో 2,600 పోస్టులు, అటవీ శాఖలో 2,750 పోస్టులు ఇతరులు 5000 పోస్టుల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల కానుంది. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట వరాలయ్యాయి. ఒకదాంట్లో జాబ్ రాలేదని బాధపడేవారికి ఇది సువర్ణావకాశం.