కొలంబో, ఆగస్ట్ 31: కొలంబో వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న టీమిండియా లంక బౌలర్లకు చుక్కలు చూపిస్తుంది. మ్యాచ్ ప్రారంభంలో ధావన్ వికెట్ కోల్పోయినప్పటికీ తర్వాత దిగిన కోహ్లీ, ఓపెనర్ రోహిత్లు శ్రీలంక ఆటగాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు. బౌలర్లను బెంబేలెత్తిస్తూ భారత సారథి కేవలం 76 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ నేపధ్యంలో కెఫ్టెన్ కోహ్లీ తన 29వ సెంచరీని సాధించాడు. మరోపక్క కోహ్లీకి ధీటుగా బ్యాటింగ్ చేస్తూ రోహిత్ శర్మ కూడా దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం 80బంతులాడిన కోహ్లీ 15 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 113 పరుగుల దగ్గర ఉండగా, రోహిత్ 66 బంతులలో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. టీమిండియా ప్రస్తుత స్కోర్ ఒక వికెట్ నష్టానికి 25.5 ఓవర్లకు 200 పరుగులుగా ఉంది.