ఏపీ డీఎస్సీ తుది జాబితా విడుదల!

SMTV Desk 2019-08-30 12:43:21  

ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ-2018కి ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేయనుంది. ఇదివరకే పోస్టుల వారీగా ప్రాథమిక ఎంపిక జాబితాలను విడుదల చేసిన విద్యాశాఖ.. సెప్టెంబరు 4, 5 తేదీల్లో పోస్టుల వారీగా రెండో జాబితాను విడుదల చేయనుంది. అనంతరం సెప్టెంబరు 10 తర్వాత ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తుది జాబితాను విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 7,902 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ-2018 నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబరు-జనవరి నెలల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు 5,05,547 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఫిబ్రవరి 15న ఫలితాలు విడుదల చేయగా.. మొత్తం వీరిలో 4 లక్షల పైచిలుకు (81.85 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. ప్రభుత్వం ప్రకటించిన మొత్తం పోస్టుల్లో ప్రభుత్వ జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలల పరిధిలో 4,341 పోస్టులు; మున్సిపల్ పాఠశాలల పరిధిలో 1,100 పోస్టులు; ఆదర్శ పాఠశాలల్లో 909 పోస్టులు; గిరిజన పాఠశాలల్లో 800 పోస్టులు, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 175, బీసీ సంక్షే పాఠశాలల్లో 404, స్కూల్ ఎడ్యుకేషన్‌లో 173 పోస్టులు ఉన్నాయి.