హీరో మోటోకార్ప్‌ ప్లాంట్లు మూసివేత

SMTV Desk 2019-08-18 14:14:47  

దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ మూడు రోజుల పాటు తన ప్లాంట్లను మూసివేసినట్లు ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి 18 వరకు ఈ మూసివేత కొనసాగుతుందని పేర్కొంది. మార్కెట్‌ పరిస్థితులు, వార్షిక సెలువుల కారణంగా ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు కార్ల సంస్థలు తాత్కాలికంగా ప్లాంట్లను మూసివేస్తున్న సమయంలో హీరో ప్రకటన రావడం గమనార్హం. ద్విచక్ర వాహన రంగంలో ప్లాంట్‌ను మూసివేసిన తొలి సంస్థ హీరోనే. ఈ మూసివేత మార్కెట్‌ పరిస్థితులను అంచనా వేయడానికి, ఉత్పత్తి ప్రణాళికను తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుందని హీరో పేర్కొంది.