సీజన్ 7లో భాగంగా శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ పార్చూన్జైంట్స్ని తమిళ్ తలైవాస్ అలవోకగా ఓడించేసింది. సీజన్లో ఆరో మ్యాచ్ ఆడిన తమిళ్ తలైవాస్కి ఇది మూడో గెలుపుకాగా.. ఆరో మ్యాచ్ ఆడిన గుజరాత్ ఈరోజు మూడో ఓటమిని చవిచూసింది. మ్యాచ్లో తమిళ్ తలైవాస్ స్టార్ రైడర్ అజయ్ ఠాకూర్ 16 సార్లు రైడ్కి వెళ్లి 9 పాయింట్లు తేగా.. డిఫెండర్ మోహిత్ చిల్లర్ ఆరుసార్లు ట్యాకిల్కి ప్రయత్నించి.. ఐదు పాయింట్లని టీమ్కి అందించాడు. మరోవైపు గుజరాత్ టీమ్ రైడర్ రాహుల్ గులియా 18 సార్లు రైడ్కి వెళ్లి 9 పాయింట్లను సాధించాడు. డిఫెండిగ్లోనూ సునీల్ కుమార్ 9 సార్లు ట్యాకిల్కి ప్రయత్నించి.. ఆరు పాయింట్లతో సత్తాచాటాడు. అయితే.. రైడర్లు, డిఫెండర్లు సమష్టిగా రాణించిన తమిళ్ తలైవాస్నే ఆఖరిగా విజయం వరించింది. మరో మ్యాచ్లో పుణెరి పల్టాన్ని 32-30 తేడాతో దబాంగ్ ఢిల్లీ ఓడించేసింది. పాయింట్ల పట్టికలో దబాంగ్ ఢిల్లీ 26 పాయింట్లతో నెం.1 స్థానంలో కొనసాగుతుండగా.. ఆ తర్వాత జైపూర్ పింక్ పాంథర్స్ (20), తమిళ్ తలైవాస్ (20), బెంగళూరు బుల్స్ (20) టాప్-4లో కొనసాగుతున్నాయి.