కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

SMTV Desk 2019-08-08 14:28:02  

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ తీపి కబురందనుంది. కేంద్రీయ విద్యాలయ సంగథన్ (కేవీఎస్) ఉద్యోగలు వేతనాలు పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. అలాగే ఇంటి అద్దె అలవెన్స్, డియర్‌నెస్ అలవెన్స్ పెంపునకు ఓకే చెప్పింది. కేవీఎస్ పర్సనెల్ డిపార్ట్‌మెంట్ కూడా దీనికి సంబంధించి ఆర్డర్లు జారీ చేసింది. వీటి ప్రకారం ఈ ఉద్యోగుల గ్రేడ్ పే స్కేల్‌ను రూ.4,200 నుంచి రూ.4,600కు పెరిగింది. అలాగే లెవెల్ 6 నుంచి లెవెల్ 7కు ప్రమోషన్ లభించింది. దీంతో నెలవారీ జీతం రూ.5,000 పెరుగుతుంది. ఆల్ ఇండియా అడిట్ అండ్ అకౌంట్స్ అసోసియేషన్ అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ హరిశంకర్ తివారీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కవీఎస్‌లో పనిచేసే అసిస్టెంట్ ఎడిటర్ల బేసిక్ వేతనంతోపాటు హెచ్ఆర్ఏ, డీఏ వంటివి కూడా పెరుగుతాయని తెలిపారు. వేతన పెంపు 2016 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. అంటే ఉద్యోగులు దాదాపు మూడున్నర్ర ఏళ్ల ఎరియర్స్ లభిస్తాయి. 7వ వేతన సంఘం ప్రకారం.. లెవెల్ 7 అధికారుల మినిమమ్ బేసిక్ శాలరీ రూ.44,900గా ఉంది. దీనికి 12 శాతం డీఏ, రూ.10,776 హెచ్ఆర్ఏ అదనం. అదే లెవెల్ 6 అధికారుల బేసిక్ పే రూ.35,400గా ఉంది. దీనికి 12 శాతం డీఏ, రూ.8,496 హెచ్ఆర్ఏ అదనం.