పీఎఫ్ అకౌంట్ లో ప్రతి నెలా ఉద్యోగి జీతంలో కొంత భాగం జమవుతుంది. కంపెనీ కూడా ఇదే మొత్తంలో కొంత డబ్బున్ని ఈపీఎఫ్ ఖాతాలో వేస్తుంది. ఉద్యోగులు అప్పుడప్పుడూ తమ అకౌంట్లో ఎంత మొత్తం జమ అయ్యిందో అని తెలుసుకుంటూ ఉంటారు. అయితే పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో ఆన్లైన్లోనే కేవలం 5 నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. ఈపీఎఫ్వో వెబ్సైట్ లేదా ఉమాంగ్ యాప్ రూపంలో బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. కాగా 20 కన్నా ఎక్కువ ఉద్యోగులను కలిగిన కంపెనీలు కచ్చితంగా వారి ఎంప్లాయీస్కు ఈపీఎఫ్వో సదుపాయం కల్పించాలి. ఎలా చెక్ చేసుకోవాలంటే...
✺ ఈపీఎఫ్వో వెబ్సైట్కు ( https://passbook.epfindia.gov.in/MemberPassBook/Login) వెళ్లండి. మెంబర్-పాస్బుక్ ఆప్షన్పై క్లిక్ చేయండి.
✺ మెంబర్-పాస్బుక్ ఆప్షన్పై క్లిక్ చేసిన తర్వాత మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా వంటి వివరాలు ఎంటర్ చేయాలి.
✺ తర్వాత మీకు కొత్ పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మెంబర్ ఐడీని ఎంచుకోవాలి. వెంటనే ఈ-పాస్బుక్ ఓపెన్ అవుతుంది. మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడొచ్చు.
✺ ఉమాంగ్ యాప్ సాయంతో కూడా పీఎఫ్ బ్యాలెన్స్ ఎంత ఉందో చూడొచ్చు. యాప్లోని ఈపీఎఫ్వో ఐకాన్పై క్లిక్ చేయాలి. మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్ అని కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. వేరొక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వ్యూ పాస్బుక్పై క్లిక్ చేయాలి. యూఏఎన్, వన్టైమ్ పాస్వర్డ్ (ఓటీపీ) ఎంటర్ చేయాలి. ఇప్పుడు మీ పీఎఫ్ బ్యాలెన్స్ చూడొచ్చు.