ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కేంద్ర ప్రభుత్వం జమ్ముకాశ్మీర్ విషయంలో తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై తాజాగా స్పందించారు. జమ్మూకశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆనంద్ మహీంద్రా స్వాగతిస్తూ... భారతీయులు కశ్మీరీలను ఆత్మీయ ఆలింగనం చేసుకుని అక్కున చేర్చుకోవాల్సిన సమయం ఇందంటూ ట్వీట్ చేశారు. దీనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని నిర్ణయాలకు వచ్చేసరికి అరే ఎందుకని ముందుగానే వీటిని తీసుకోలేదు అని అనిపిస్తుంది. కేంద్రం ఈ రోజు తీసుకున్న నిర్ణయం కూడా ఈ కోవకు చెందుతుంది. జాతీయ వర్గంలోకి చేరిన కశ్మీరీలను ఎలాంటి సంకోచం లేకుండా.. పూర్తిగా మనవారు అయ్యారనే భావనతో ఆత్మీయంగా హత్తుకోవాల్సిన సమయం ఇది’ అని ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్కు 5,500 రీట్వీట్లు, 32 వేలకుపైగా లైక్లు వచ్చాయి. ఆనంద్ మహీంద్రా మాత్రమే కాకుండా పలు వ్యాపారవేత్తల కూడా కశ్మీర్ అంశంపై తమ అభిప్రాయలను వెల్లడించారు. ‘ఆర్టికల్ 370ను ఎప్పుడో రద్దు చేయాల్సింది. ఇప్పుడు బీజేపీ సర్కారు సాహసోపేత చర్య ద్వారా ఇది సాధ్యమైంది’ అని జేఎస్డబ్ల్యూ గ్రూప్ సీఎండీ సజ్జన్ జిందాల్ హర్షం వ్యక్తం చేశారు. ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్లో పెట్టుబడులు పెరుగుతాయిని, తద్వారా పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాజీవ్ తల్వార్ అభిప్రాయపడ్డారు.