మార్కెట్‌లో పసిడి పరుగులు!

SMTV Desk 2019-08-06 11:49:28  Gold Rate, Silver rate, Bullion market

మంగళవారం(ఆగస్ట్06) పసిడి ధర మళ్ళీ పుంజుకుంది. హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.440 పెరుగుదలతో రూ.37,610కు చేరింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ ఉన్నప్పటకీ జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ధరపై సానుకూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.440 పెరుగుదలతో రూ.34,600కు ఎగసింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర రూ.44,530 వద్ద నిలకడగా కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.450 పెరుగుదలతో రూ.36,540కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.450 పెరుగుదలతో రూ.35,350కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర స్థిరంగా ఉంది. రూ.44,530 వద్ద నిలకడగా కొనసాగుతోంది.