రూటు మార్చేసిన మెగా మేనల్లుడు!!

SMTV Desk 2019-07-17 12:32:18  

మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ ఎట్టకేలకు చిత్రలహరి సినిమాతో పర్వాలేదనిపించే విధంగా సక్సెస్ అందుకున్నాడు. ఎలాంటి విజయాలు లేనప్పుడే సాయి ధరమ్ తేజ్ వరుస అవకాశాలను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మనోడికి అవకాశాల డోస్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ చర్చించుకుంటున్నారు.

కానీ సాయి మాత్రం ఇక నుంచి తొందరపడి సినిమాలను సెలెక్ట్ చేసుకోవద్దని డిసైడ్ అయ్యాడట. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో ప్రతిరోజు పండగే అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని వేగంగా పూర్తి చేసిన చిత్రి యూనిట్ వీలైనంత త్వరగా మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయాలనీ ప్లాన్ చేస్తోంది.

ఇక రీసెంట్ గా నాలుగు కథలు విన్న సాయి ధరమ్ ఏ ఒక్క కథను ఒకే చేయలేదట. అందులో ఒక కథ బావున్నప్పటికీ తనకు సెట్టవ్వదని దర్శకుడిని నొప్పించకుండా మరో కథ రెడీ చెయ్ అని భరోసా ఇచ్చాడట. కథ నచ్చకుంటే వెంటనే మొహం మీద చెప్పేస్తున్నాడట. మరి ఈ ఆలోచనతో మెగా మేనల్లుడు కెరీర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటాడో చూద్దాం. మారుతి సినిమాను పొంగల్ కి రిలీజ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.