న్యూఢిల్లీ, ఆగస్ట్ 30 : ఇటీవల 1000 రూపాయల కొత్త నోటు మళ్ళీ మార్కెట్లోకి విడుదల కానుందని సోషల్ మీడియాలో పుకార్లు రావడంపై కేంద్రం స్పందించింది. వెయ్యి రూపాయల నోటును తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టే ఆలోచన లేదని కేంద్ర ఆర్ధిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వెల్లడించారు. ఈ విషయం గురించి జాతీయ మీడియాలో వస్తున్న వార్తలన్నీ వాస్తవాలు కాదని, వాటిని నమ్మవద్దని ఆయన సూచించారు. అయితే ఆర్బీఐ తాజాగా రూ. 200 నోటు, రూ. 50 నోట్లను మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ నోట్లను ఏటీఎం నుండి కాకుండా రిజర్వు బ్యాంకు, బ్యాంకు అనుసంధానాలలో మాత్రమే వీటిని జారీ చేస్తున్న విషయం విధితమే.