న్యూ ఢిల్లీ, ఆగస్టు, 29 : భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఇకపై వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ట్విట్టర్ పేజ్ను చూడండని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ఈ ట్విట్టర్ పేజ్లో ఉప రాష్ట్రపతి ప్రతిరోజు హాజరవుతున్న కార్యక్రమాల వివరాలు, ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వారితో ఈ రోజు వెంకయ్య నాయుడు ప్రమాణ స్వీకారం చేయించారని అందులో తెలిపారు. కాగా, మరోవైపు ఆయన వ్యక్తిగత ఖాతా కూడా యధావిధిగా కొనసాగనున్నట్లు వెల్లడించారు.