ముంబై: సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. ఉదయం భారీ లాభాలతో దూసుకెళ్లిన సూచీలు సాయంత్రానికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 163 పాయింట్లు పెరిగి 39,779 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 11,918 పాయింట్ల వద్ద స్థిరపడింది. హెచ్సిఎల్ టెక్, టిసిఎస్, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్ షేర్లు భారీగా లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే ఐటి, ఎఫ్ఎంసిజి సూచీలు 1 శాతానికి పైగా పెరిగాయి. మీడియా, పిఎస్యు బ్యాంక్ల సూచీలు 2 శాతం వరకు నష్టపోయాయి.