బాలీవుడ్లో 20 ఏళ్ల పడుచు భామల గ్లామర్ హంగామా సంగతి ఎలా ఉందో ఏమో కానీ ఈమధ్య 40 ప్లస్ భామల రచ్చ ఎక్కువైంది. మలైకా అరోరా, మందిరా బేడి, శిల్పా శెట్టి… ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్టు చాలా పెద్దదిగా ఉంటుంది. వీళ్లందరూ జిమ్లో ప్రతిరోజూ కసరత్తులు చేయనిదే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టరు. అందుకే 40 ప్లస్ వయసులోనూ ఫిట్గా ఉంటారు. ఇక సోషల్ మీడియాలో తరచుగా హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటారు. ఈ లిస్టులోనే ఉన్న మరో భామ అమీషా పటేల్. హృతిక్ తొలి చిత్రం ‘కహో నా ప్యార్ హై’ సినిమాతో 20 ఏళ్ల క్రితం బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. ఆమె తెలుగులో పవన్ సినిమా ‘బద్రి’లో కూడా హీరోయిన్గా నటించింది. మొదట్లో కెరీర్ బాగానే ఉంది కానీ గత కొన్నేళ్ళుగా విజయాలేమీ సాధించలేదు. అయితే కెరీర్తో సంబంధం లేకుండా కసరత్తులు చేయడం సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడం… ఇలా కాలం గడుపుతూ ఉంది ఈ హాట్ బ్యూటీ. ఈమధ్య ముఖంలో కాస్త వయసు తెలుస్తోంది కానీ ఒంపు సొంపుల అందం ఏమాత్రం తగ్గలేదు. తాజాగా ఈ భామ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక హాట్ ఫోటోను పోస్ట్ చేసింది. చిత్రమైన విషయం ఏంటంటే ఈ ఫోటోకు ఒక్క కామెంట్ లేదు. లైకులు సంఖ్య మాత్రం బాగానే ఉంది. ఇక సినిమాల విషయానికి వస్తే అమీషా ప్రస్తుతం ‘దేశీ మ్యాజిక్’ అనే బాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఇదొక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని తెలిసింది.