అనుమానంతో భార్యపై దాడి...!

SMTV Desk 2017-08-29 17:53:39  attack on wife, husband, gatkesar, police station,

మేడ్చల్ ఆగస్ట్ 29: మరో మహిళపై చిత్రహింసలు, వేధింపుల నీచ పరంపర వెలుగులోకి వచ్చింది. మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో ఈ దారుణం చోటు చేసుకుంది. మహబూబాబాద్ కి చెందిన యువతికి వరంగల్ కి చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రవినాయక్ తో 2008 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. రవి తన భార్యపై అనుమానంతో వైద్య పరీక్షల పేరుతో రోజు చిత్రహింసలు పెట్టేవాడు. ఆ మహిళ భర్త వేధింపులు తాళలేక పుట్టింటికి వెళ్లింది, అక్కడికి కూడా వచ్చి మానసికంగా, శారీరకంగా, కత్తులతో పొడిచి హింసించాడని ఘట్ కేసర్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది, దీంతో పోలీసులు 498(ఎ), 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.