తెలంగాణ ఇంటర్ బోర్డుపై హైకోర్ట్ ఫైర్

SMTV Desk 2019-06-07 16:55:11  High court telangana,

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్టు వ్యవహార శైలిపై హైకోర్టు సీరియస్‌ అయ్యింది. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు, బోర్డు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్ట్. ఇంటర్ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ఫలితాల రిపోర్ట్ ను కోర్టుకు సమర్పించింది ఇంటర్ బోర్డు. అయితే.. రీకౌంటింగ్, రీ వేరిఫికేషన్ పై ఇంకా 8 వేల మంది విద్యార్థులవి ప్రాసెస్ లో ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు పిటిషనర్ తరపు న్యాయవాది. దీంతో ఇంటర్ బోర్డు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు.

అంతేకాకుండా ఆత్మహత్య చేసుకున్న 26 మంది విద్యార్థుల జవాబు పత్రాలను సిద్ధం చేయాలని కూడా కోర్ట్ ఆదేశించింది. అదేవిధంగా రీ వేరిఫికేషన్, రీ వ్యాల్యుయేషన్ లో మరోసారి ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వహించిందని పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్ట్ కు తెలిపడంతో కోర్ట్ మండిపడింది. అలాగే... ఈ కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు.