న్యూఢిల్లీ: దేశీ ఐటి దిగ్గజం విప్రో అమెరికాకు చెందిన ఇంటర్నేషనల్ టెక్నిగ్రూప్ ఇన్కార్పొరేటెడ్(ఐటిఐ)ను సొంతం చేసుకోనుంది. దాదాపు రూ.45 మిలియన్ డాలర్లకు (రూ.312 కోట్లు) ఈ సంస్థను స్వాధీనం చేసుకోవాలని చూస్తుంది. ఐటిఐ సంస్థ కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, ప్రోడక్ట్ లైఫ్సైకిల్ మేనేజ్మెంట్ ఇంటర్ఆపరబులిటీ సాఫ్ట్వేర్ను అందిస్తుంది. 1983లో స్థాపించిన ఈ సంస్థ అధికార కార్యాలయం అమెరికాలోని ఒహియోలో ఉంది. ఈ సంస్థలు బ్రిటన్, ఇటలీ, ఇజ్రాయెల్, జర్మనీ దేశాల్లోనూ కార్యాలయాలు ఉన్నాయి. 2019 మార్చి నాటికి ఈ సంస్థలో 130 మంది ఉద్యోగులు ఉన్నారు.