టీటీడీ చైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

SMTV Desk 2019-06-06 13:06:38  vy subba reddy, ttd,

ఏపీలోని ఎంతో ప్రతిష్టాత్మక దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ ఆలయానికి టీటీడీ పాలక మండలి చైర్మెన్‌గా ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కాగా వైవీ సుబ్బారెడ్డి ఒంగోలు జిల్లాకు వైసీపీ తరఫున గతంలో ఎంపీగా పలు రకాలుగా ఏపీకి ప్రత్యేక హోదాపై ముమ్మరంగా ఉద్యమించారు. హోదా కోసం పదవికి కూడా రాజీనామా చేశారు. అంతేకాకుండా ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డికి సమీప బంధువు కావడంతో రాజకీయంగా కష్ట శుఖాల్లో మొదటి నుంచీ చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం టీటీడీ పాలకమండలి చైర్మెన్‌గా పుట్టా సుధాకర్ యాదవ్ కొనసాగుతున్నారు.