పీసీసీ అధ్యక్షపదవి పై ఆశ లేదు

SMTV Desk 2019-06-06 12:26:27  komat reddy,

స్థానిక పరిషత్ ఎన్నికలలో కాంగ్రెస్ సత్తా చాటిందని అన్నారు ఆ పార్టీ ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయినా.. ఎంపీ, పరిషత్ ఎన్నికలలో గెలిచామని చెప్పారు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజమని ఆయన అన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం గెలుపు శాశ్వతం అని అనుకుంటుందని అన్నారు.

సీఎం కేసీఆర్ మాటకు ముందు, మాటకు వెనక కాళేశ్వరం అంటాడే తప్ప…స్థానిక సంస్థలను మరిచారని విమర్శించారు వెంకట్ రెడ్డి. ఈ విషయం పై మాట్లాడేందుకు ఒక్క MLA కు కూడా దమ్ములేదని ఆయన అన్నారు. ఎన్నికలలో గెలిచిన వారందరూ ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో పోరాడాలని వెంకట్ రెడ్డి కోరారు. తనకు పీసీసీ అధ్యక్షపదవి పై ఆశ లేదని ఆయన చెప్పారు. MP పదవే తనకు పెద్దదని మరో పదవి అక్కరలేదని తెలిపారు. ఆంధ్రాలో జగన్ ఏవిధంగా అయితే విపక్షంలో ఉండి ప్రభుత్వం పై పోరాడాడో తాను కూడా అలాగే పోరాటం చేస్తామని ఆయన అన్నారు.