హైదరాబాద్: దూరప్రాంత ప్రయాణీకులను దృష్టిలో పెట్టుకొని కొత్త సేవలను ప్రారంభించనున్నట్లు సిపిఆర్ఓ రాకేష్ తెలపారు. ఈ నేపత్యంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే పది ఎక్స్ప్రెస్ రైళ్లకు ఒక్కోదానికి మూడు ఏసి త్రీ టైర్ కోచ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. లింగంపల్లి-తిరుపతి నారాయణాద్రి ఎక్స్ప్రెస్కు ఈ ఏడాది అక్టోబరు 1 నుంచి, తిరుగు ప్రయాణంలో తిరుపతి-లింగంపల్లి ఎక్స్ప్రెస్కు అక్టోబరు 2నుంచి ఏసి త్రీ టైర్ కోచ్ను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ ట్రైన్తో పాటు సికింద్రాబాద్-గూడూరు సింహపురి ఎక్స్ప్రెస్కు అక్టోబరు 1న, సికింద్రాబాద్-ముంబై సిఎస్ఎంటి దేవగిరి ఎక్స్ప్రెస్కు అక్టోబరు 3న, తిరుగు ప్రయాణం రైలుకు అక్టోబరు 4న, కాచిగూడ-చిత్తూరు వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు అక్టోబరు 1న, చిత్తూరు-కాచిగూడకు వచ్చే రైలుకు అక్టోబరు2న ఏసి త్రీ టైర్ కోచ్లను ఏర్పాటు చేయనున్నారు. కాకినాడపోర్టు-లింగంపల్లి గౌతమి ఎక్స్ప్రెస్కు అక్టోబరు1న, లింగంపల్లినుంచి కాకినాడపోర్టుకు వచ్చే రైలుకు అక్టోబరు 2న ఏసి త్రీ టైర్ బోగి ఏర్పాటు చేయనున్నారు. పైన పేర్కొన్న రైళ్లలో ఆయా తేదీల నుంచి ఏసి త్రీ టైర్ బోగీలు శాశ్వతంగా ఉండనున్నాయి.