ఏపీ ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులైన మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం ఈరోజు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఇప్పటికే సచివాలయంలోని మొదటి బ్లాక్ లో చాంబర్ ను కేటాయించిన విషయం తెలిసిందే.
అదేవిధంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్ హోదాతో కూడిన పదవిని ఆయనకు అప్పగించారు. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం అధిపతిగా ఆయన వ్యవహరించనున్నారు. ప్రభుత్వ సలహాదారులతో పాటు రాష్ట్రంలో ఏ శాఖకు చెందిన అధికారినైనా పిలిచి సలహాలు.. సూచనలు ఇచ్చే అధికారాన్ని ప్రభుత్వం ఆయనకు కల్పించింది. ఆయన ఈ పదవిలో మూడేళ్లపాటు కొనసాగనున్నారు.
అంతేకాకుండా ఈరోజు ఉదయాన్నే అజయ్ కల్లం తాడేపల్లిలోని వైఎస్ జగన్ నివాసానికి వెళ్లి కలిసి ప్రత్యేక కృతజ్ఞతులు తెలిపారు.