సినాయీ ద్వీపకల్పంలో ఉగ్రవాదుల దాడి...10 మంది పోలీసులు మృతి

SMTV Desk 2019-06-06 12:13:01  Sinai terrorist attack in check post

ఈజిప్ట్‌: సినాయీ ద్వీపకల్పంలో ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ద్వీపకల్పంలోని ఓ చెక్‌ పాయింట్‌ వద్ద ఇస్లామిక్‌ ఉగ్రవాదులు ఈ దాడి చేశారు. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది సాధారణ పోలీసులు ఉన్నట్లు వారు నిర్ధరించారు. అయితే రంజాన్‌ సందర్భంగా ఈల్ అరీష్‌ నగరంలో ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. చెక్‌ పాయింట్ వద్ద దాడి అనంతరం ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకుపారిపోవాలని ప్రయత్నించారు. అయితే, వెంటనే ఓ యుద్ధ విమానంలో వారిని వెంటాడిన భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు తెలిపారు.