ముంబయి: భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్, బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కాకపోయినా వారి పేర్లు ఒకేరకంగా ఉంటాయి. దీంతో నెటిజన్లు ఇటు కత్రినాను, అటు మహమ్మద్ను అప్పుడప్పుడూ ఆటపట్టిస్తూ ఉంటారు. ఎన్నో రోజుల నుంచి ఇలాంటి కామెంట్లు వస్తున్నప్పటికీ వీరిద్దరు ఎప్పుడూ ఎదురుపడింది లేదు. అయితే ఇటీవల వీరు ఓ చోట ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా కైఫ్ ద్వయం ఫొటో పోజు ఇచ్చింది. దీన్ని మహమ్మద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఎట్టకేలకు కత్రినాను కలుసుకున్నాను.ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి బంధుత్వం లేదు. మానవత్వం తప్ప అంటూ కత్రినాతో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. అయితే ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. కైఫ్ స్వ్కేర్ను ఒకేసారి చూడాలన్న కల ఇప్పటికి తీరిందని కామెంట్లు పెడుతున్నారు.