ముంబై: మంగళవారం దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సోమవారం భారీ లాభాలతో ఉన్నత శిఖరాలకు చేరిన సెన్సెక్స్ ఒక్కసారిగా 184 పాయింట్లు నష్టపోయింది. ఆఖరికి 40,083 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక నిఫ్టీ 66 పాయింట్లు నష్టపోయి 12,021 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో మార్కెట్లు నష్టపోయాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రధానంగా హీరో మోటోకార్ప్, టిసిఎస్, హెచ్సిఎల్ టెక్, ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఆటో భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటి సూచీ 1.2 శాతం నష్టపోయింది. రూ.738 కోట్ల విలువైన ఆరావళి పవర్ కాంట్రాక్టు దక్కడంతో జిఇ పవర్ఇండియా షేర్లు 5 శాతం లాభపడ్డాయి. మణప్పురం ఫైనాన్స్ షేర్లు 5 శాతం లాభపడ్డాయి.