ఇండియాపై బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలు

SMTV Desk 2019-06-05 16:30:50  India vs South africa

ప్రపంచకప్ టోర్నీలో భాగంగా నేడు ఇంగ్లాండ్ వేదికగా భారత్- దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టోర్నీలో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన దక్షిణాఫ్రికా జట్టు.. రెండింటిలోనూ ఓడిపోగా.. భారత్ జట్టుకి ఇదే తొలి మ్యాచ్. ఐపీఎల్ 2019 సీజన్ నేపథ్యంలో.. వారం రోజులు ఆలస్యంగా వరల్డ్‌కప్‌లో టీమిండియా తన ప్రయాణాన్ని ఆరంభిస్తోంది. నెం.4 స్థానంలో విజయ్ శంకర్‌కి బదులుగా కేఎల్ రాహుల్‌కి ఛాన్స్ దక్కింది.
భారత్ తుది జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లి (కెప్టెన్), లోకేశ్ రాహుల్, మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్), కేదార్ జాదవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా.
దక్షిణాఫ్రికా తుది జట్టు: డికాక్ (వికెట్ కీపర్), హసీమ్ ఆమ్లా, డుప్లెసిస్ (కెప్టెన్), దుస్సేన్; డేవిడ్ మిల్లర్, డుమిని, ఫెలుక్వాయో, క్రిస్ మోరీస్, కగిసో రబాడ, ఇమ్రాన్ తాహిర్, షంషీ.