జగన్ కు ఏడు అంశాల మీద ఏడు లేఖలు రాసిన బీజేపీ నేత

SMTV Desk 2019-06-05 16:30:00  kanna laksmi narayana, jagan,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వరుస లేఖలు రాశారు. జగన్‌ కి ఆయన 7 లేఖలు రాశారు. ఆ లేఖల్లో రాజధాని భూముల అక్రమాలు, అసైన్డ్ భూముల కొనుగోలులో అక్రమాలపై విచారణ జరిపించి, రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులుగా మారిన ప్రజలకు న్యాయం చేయాలని కూడా కన్నా లేఖలో ముఖ్యమంత్రిని కోరారు. అలాగే రాష్ట్రంలో చుక్కల భూముల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాక అగ్రిగోల్డ్ అవినీతి వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే ఏపీ దేవాదాయ పరిరక్షణ చట్టంలో మార్పులు తీసుకురావాలని ఆయన ముఖ్యమంత్రి జగన్ ను కోరారు. విజయవాడలో ఇష్టానుసారం కూలగొట్టిన ఆలయాలను తిరిగి నిర్మించాలని ఆయన కోరారు. అంతే కాక గత ప్రభుత్వం తెచ్చిన ఉచిత ఇసుక విధానంపై ఆలోచన చేయాలని కోరారు. అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేలా కొత్త పాలసీ తేవాలని సూచించారు. ఇలా ఏడు అంశాల మీద ఏడు లేఖలు వ్రాశారు