రవి ప్రకాష్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్న పోలీసులు

SMTV Desk 2019-06-05 16:24:25  Ravi Prakash,

టివి9 మాజీ సిఇఒ రవి ప్రకాశ్ ఫోర్జరీ కేసులో భాగంగా రెండో రోజు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట రవి హాజరయ్యారు. విచారణ నిమిత్తం రవి ప్రకాశ్‌ను అనేక ప్రశ్నలు పోలీసులు సంధించారు. కంపెనీ సెక్రటరీ దేవేంద్ర అగర్వాల్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందెవరని, సంతకం ఎందుకు ఫోర్జరీ చేయాల్సి వచ్చిందని పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. ఒప్పంద పత్రాలలో ఎన్‌సిపిఎల్‌టికి పాత తేదీలలో శివాజీతో కలిసి ఫిర్యాదు చేయించడానికి కారణం ఏంటని అడిగారు. శివాజీకి 40 వేల షేర్లు ఎందుకు అమ్ముకోవాల్సి వచ్చిందని ప్రశ్నల వర్షం కురిపించారు. మీడియా, మాఫియా మధ్య పోరాటం అంటున్నారు కదా… టివి9 యాజమాన్య మార్పిడి జరిగినప్పుడు సిఇఒగా దానిని కొత్త యాజమాన్యానికి అప్పగించాల్సిన బాధ్యత మీపై లేదా?, టివి9 లోగో అనేది ఆ సంస్థకు చెందిన ఆస్తి అని, టివి9 అమ్మాం కానీ…. లోగోను అమ్మలేదంటూ మీరు మాట్లాడటంతో ఏమైనా అర్థం ఉందా? నిలదీశారు. యాజమాన్యానికి తెలియకుండా టివి9 నిధులు ఎందుకు దర్వినియోగం చేశారా? లేదా ? అని అడిగారు. ఎలాంటి తప్పు చేయనప్పుడు నెల రోజులుగా ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నారని, లొంగిపోయి వివరణ ఇస్తే అయిపోయేది కదా? పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం.