200 కోట్ల క్లబ్ లో చేరిన మహర్షి

SMTV Desk 2019-06-05 16:21:47  Maharshi,

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన ‘మహర్షి’ 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా మే 9న విడుదలైన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా, అల్లరి నరేశ్ కీలక పాత్రలో నటించారు. ఈ క్రమంలో ఈ సినిమా సరికొత్త రికార్డులను నమోదు చేసింది. విడుదలైన 27 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి5 200 కోట్ల క్లబ్ లో చేరింది. నైజామ్ ఏరియాలో మహేశ్ బాబు కెరీయర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ‘మహర్షి’ నిలిచింది. వారాంతపు వ్యవసాయం, సామాజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన ‘మహర్షి’ సినిమాలో కట్టిపడేసే భావోద్వేగాలు. మహేశ్ డిఫరెంట్ లుక్స్ , పూజా హెగ్డే గ్లామర్,నరేశ్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయని సినీ విశ్లేషకులు చెతున్నారు. ఈ ఏడాది ప్రధమార్థంలోనే మహేశ్ తన పేరిట కొత్త రికార్డును నమోదు చేసుకున్నాడని ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.