వైసిపి పార్లమెంటరీ నేతగా విజయసాయిరెడ్డి

SMTV Desk 2019-06-05 16:12:02  vijay sai reddy,

అమరావతి : వైసిపి పార్లమెంటరీ నేతగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎన్నికయ్యారు. లోక్ సభలో వైసిపి పక్ష నేతగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైసిపి విప్ గా భరత్ ను నియమిస్తూ ఎపి సిఎం, వైసిపి చీఫ్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ముగ్గురిని ఆయా పదవుల్లో నియమించామని జగన్ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రికి లేఖ రాశారు. వైసిపిలో కీలక నేతగా పేరున్న విజయసాయిరెడ్డిని మంత్రిగా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే వైసిపి అధిష్ఠానం మాత్రం ఆయన్ను పార్లమెంటరీ పార్టీ నేతగా నియమించడం జరిగింది. ఈ నెల 9న ఎపి మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశం కనిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణపై సిఎం జగన్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, మంత్రుల జాబితా సిద్ధమైందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.