ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి దేశంగా భారత్?

SMTV Desk 2019-06-05 16:09:13  china, India, world bank

భారత్ రానున్న రెండేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారుతుంది అని ప్రపంచబ్యాంకు తెలిపింది. ఈ ఏడాది భారత ఆర్థికవృద్ధి రేటు 7.5 శాతం ఉంటుందని...రాబోయే రెండేళ్లు అంటే 2019-20, 2020-21లో కూడా ఇదే వృద్ధిరేటు నమోదు అవుతుందని వెల్లడించింది. అదే సమయంలో చైనా వృద్ధిరేటు 2018లో 6.6 శాతంగా నమోదు కాగా, ఈ ఏడాది అది 6.2 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. ఇది 2020లో 6.1 శాతానికి పరిమితమవుతుందని హెచ్చరించింది. అదే సమయంలో 2021 నాటికి భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యవస్థగా మారుతుందని చెప్పింది. 2021 నాటికి భారత వృద్ధిరేటు చైనా కంటే 1.5 శాతం అధికంగా ఉంటుందని వెల్లడించింది. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో పేర్కొంది.