ప్రజల దీవెనతో జగన్ సిఎం అయ్యారు :గాయని సుశీల

SMTV Desk 2019-06-04 16:21:22  susheela, singer,

అమరావతి : ఎపి సిఎం, వైసిపి చీఫ్ జగన్ కు ప్రముఖ గాయని సుశీల ఆశీస్సులు అందించడంతో అభినందనలు తెలిపారు. దివంగత సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాటలో సాగి పేదల సంక్షేమం కోసం పని చేయాలని ఆమె జగన్ కు సూచించారు. ఎపి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జగన్ , అదే స్ఫూర్తితో సాగి ప్రజా రంజక పాలన చేయాలని ఆమె ఆకాంక్షించారు. ప్రజల దీవెనతో జగన్ సిఎం అయ్యారని కొనియాడారు. వైస్ సిఎంగా ఉన్న సమయంలో పేద కళాకారులను ఆదుకున్నారని, కళాకారులను ప్రోత్సహించారని ఆమె గుర్తు చేశారు. జగన్ కూడా వైఎస్ బాటలోనే సాగి ఆపదలో ఉన్న కళాకారులను ఆదుకోవాలని ఆమె అభిలాషించారు.