తొలిసారి ఆసుప‌త్రి పాల‌య్యా: బాలకృష్ణ హీరోయిన్

SMTV Desk 2019-06-04 16:12:54  Sneha ullal,

హీరోయిన్ స్నేహా ఉల్లాల్ తీవ్ర జ్వరంతో బాధ‌ప‌డుతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఆమెకు ఒక్కసారిగా హైటెంపరేచర్ తో జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో సమీపంలోని ఆసుప‌త్రిలో ఆమె అడ్మిట్ అయినట్లుగా తెలుస్తోంది. తెలుగులో హీరోయిన్ స్నేహ అంటే తెలియని వారుండరు. నంద‌మూరి బాలకృష్ణ న‌టించిన సింహా లో ఆమె నటనకు తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

అయితే తాజాగా హీరోయిన్ స్నేహ సోషల్ మీడియా ద్వారా తనకు తీవ్ర జ్వరం వచ్చినట్లు తెలిపారు. తొలిసారి త‌న జీవితంలో ఆసుప‌త్రి పాల‌య్యానని తెలుపుతూ హాస్పిట‌ల్‌లో ఉన్న ఫొటోల‌ను పోస్ట్ చేశారు. హాస్పిట‌ల్లో ఉండాల్సి వ‌చ్చింది. హై టెంప‌రేచ‌ర్ ఉంది. చాలా బోర్ కొడుతోంది. కాక‌పోతే నెట్‌ఫ్లిక్స్ ఉండ‌టం వ‌ల్ల కాస్త న‌య‌మైంది అంటూ కామెంట్ కూడా పెట్టారు స్నేహా ఉల్లాల్.