భూషణ్ ఎనర్జీ కొనుగోలు పూర్తి!

SMTV Desk 2019-06-03 16:22:18  tata steel, bhushan energy

న్యూఢిల్లీ: అప్పుల్లో ఉన్న భూషణ్ ఎనర్జీని టాటా స్టీల్ కొనుకున్నట్లు ప్రకటించింది. టాటాస్టీల్ ప్రకటించిన రూ.800 కోట్ల బిడ్‌కు ఎన్‌సిఎల్‌టి(నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్) ఆమోదం తెలిపిన తర్వాత సంస్థ ఈ విషయాన్ని ప్రకటించింది. టాటా స్టీల్ బిఎస్‌ఎల్ లిమిటెడ్ విజయవంతంగా భూషణ్ ఎనర్జీ లిమిటెడ్‌ను కొనుగోలు పూర్తి చేసింది. ఈ కొనుగోలులో సెబీ నిబంధనలను పూర్తిగా పాటించామని టాటా స్టీల్ బిఎస్‌ఇ ఫైలింగ్‌లో పేర్కొంది. దివాలా చట్టం 2016 కింద బిడ్‌కు ఎన్‌సిఎల్‌టి ఆమోదం తెలిపిందని సంస్థ వెల్లడించింది. ఈ ఒప్పందం ప్రకారం, భూషణ్ ఎనర్జీలో 99.99 శాతం వాటాలను టాటా సొంతం చేసుకుంది. గురువారం ఈ బిడ్‌కు సంబంధించి భూషణ్ ఎనర్జీ మాజీ ప్రమోటర్ నీరజ్ సింఘాల్ అభ్యంతరాలను ఎన్‌సిఎల్‌టి ఢిల్లీ బెంచ్ తిరస్కరించింది.