రాబర్ట్‌ వాద్రాకు ఈడీ నోటీసులు

SMTV Desk 2019-06-03 16:13:21  robert vadra,

మనీ ల్యాండరింగ్‌ కేసులో ప్రియాంక గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాకు ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఢిల్లీలోని ఎన్‌సీఆర్, రాజస్థాన్‌లోని బికనీర్‌లో వాద్రాకు బినామీ ఆస్తులున్నట్టు ఈడీ ఆరోపించింది. లండన్‌లో 1.9 మిలియన్ పౌండ్ల విలువైన ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినట్లు కేసులు నమోదు అయ్యాయి.