అజాజ్: సిరియాలో మరో ఆత్మాహుతి దాడి చోటుచేసుకుంది. సిరియా-టర్కీ సరిహద్దు ప్రాంతంలోని అలెప్సో రాష్ట్రంలో రంజాన పవిత్ర మాసం సందర్భంగా కారులో బాంబులు పెట్టుకొని ఆత్మాహుతి దాడి చేశారు. ఈ దాడిలో 15 మంది మృతి చెందగా మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఆ ప్రాంతాన్ని టర్కీ విప్లవకారుల స్వాధీనం చేసుకున్నారు. కారులో డిటోనేటర్లు అమర్చి పేలుళ్లు జరపడంతో దుకాణాలతో పాటు పలు ఇండ్లు ధ్వంసమైనట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. శనివారం రఖ్కా నగరంలో జరిగిన దాడిలో పది మృతి చెందిన విషయం తెలిసిందే. సిరియన్ డెమోక్రటిక్ ఫోర్స్ అనే సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు సమాచారం.