టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి

SMTV Desk 2019-06-03 15:35:09  trs Party,

తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయ దుందుభి మోగించింది. ఇప్పటికే వరంగల్, నల్గొండ స్థానాలను ఆ పార్టీ సైవసం చేసుకోగా తాజాగా రంగారెడ్డి జిల్లాలో కూడా, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకి మే 31 న ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్స్ ఓటేశారు. కాంగ్రెస్ తరుపున కొమ్మూరి ప్రతాపరెడ్డి పోటీ చేశారు. పట్నం గెలుపు ఖాయమవడంతో కౌంటింగ్ పూర్తవక ముందే ప్రతాపరెడ్డి కేంద్రం నుంచి వెళ్లిపోయారు. రంగారెడ్డి ఎమ్మెల్సీ గా మహేందర్ రెడ్డి మెజార్టీ ప్రకటించాల్సి ఉంది.