వరల్డ్కప్లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ను వెస్టిండీస్ చిత్తు చేసింది. అన్ని విభాగాల్లో రాణించిన ఆ జట్టు తన బౌలింగ్ బలంతో పాకిస్తాన్ ని చావు దెబ్బకొట్టింది. దీనిపై ఆ జట్టు కెప్టెన్ హోల్డర్ స్పందించాడు. "ప్రపంచ కప్ టోర్నీని విజయంతో ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్ క్రెడిట్ బౌలర్లకే అంకితం. క్రిస్గేల్ ఎప్పటిలాగానే అద్భుతంగా ఆడాడు.ఇక మా జట్టుకు దొరికిన అరుదైన రకం ఆటగాడు రసెల్. అతడి ప్రభావం జట్టులో చాలా ఉంటుంది. అతడే మా ఆస్తి. బౌలింగ్లోనూ, ఇటు బ్యాటింగ్లోనూ అతడు 100 శాతం న్యాయం చేశాడు. ఒషానే, షెల్డోన్ కూడా చాలా బాగా బౌలింగ్ చేశారు. ఒషానే బౌలింగ్లో మ్యాచ్ గెలవాలన్న కసి కనిపించింది. మొదటి మ్యాచ్ ఎలా సాగుతుందోనని చాలా కంగారు పడ్డాను. కానీ అత్యంత సులువుగా గెలిచేశాం. మాకెలాంటి అంచనాలు లేవు. ఎలాంటి ఒత్తిడి లేకుండా క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నామని చెప్పాడు.