ప్రపంచకప్ మ్యాచ్ లు వన్సైడ్గా ముగుస్తున్నాయి. గురువారం సౌతాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లండ్ 104 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా 39.5 ఓవర్లలో కేవలం 207 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయం చవిచూసింది. అలాగే శుక్రవారం టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లోనే పాకిస్థాన్ పై 7 వికెట్ల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో క్రిస్గేల్ 50, నికోలస్ పూరన్ 34నాటౌట్ రాణించడంతో కేవలం 13.4 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ 21.4 ఓవర్లలో 105 పరుగులకే ఆలౌటైంది. ఇక శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో.. న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. మొదట టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక బ్యాట్స్మెన్ పూర్తిగా చేతులు ఎత్తేశారు. లంక బ్యాటింగ్లో కరుణరత్నే 52, కుషల్ పెరీరా 29, తిషారా పెరీరా 27 మినహా మిగితా వారందరూ సింగిల్ డిజిట్ స్కోర్కే పరిమితమయ్యారు. దీంతో శ్రీలంక 29.2 ఓవర్లలో 136 పరుగులు చేసి ఆలౌట్ అయింది.లక్ష్య చేధన ప్రారంభించిన కివీస్ వికెట్ కోల్పోకుండానే విజయం సాధించింది. ఓపెనర్లు మార్టిన్ గుప్టిల్ 73, కొలిన్ మున్రో 58 పరుగులు చేయడంతో న్యూజిలాండ్ 16.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 137 పరుగులు చేసి.. ఈ మ్యాచ్లో విజయం సాధించింది.