ఇటీవల వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. అత్యధిక మెజార్టీ సాధించిన మోదీ రెండో సారి భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. దీంతో ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
మోదీ.. ఈ నెల 9వ తేదీన సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి రేణిగుంట విమాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమల వెళ్లి స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మోదీ తిరిగి హస్తినకు చేరుకుంటారు. మోదీ పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేయనున్నారు.