వై ఎస్ జగన్ కీలక నిర్ణయం

SMTV Desk 2019-06-01 12:13:59  ys jagan,

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చార్జ్ తీసుకున్న రెండో రోజు నుండే వై ఎస్ జగన్ తన మార్క్ చూపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రాజెక్టుల్లో పారదర్శకత తీసుకువచ్చేందుకు కొత్త జీవో జారీ చేసింది ప్రభుత్వం. ఈ నేపధ్యంలో వివిధ ప్రాజెక్టులు రద్దు కానున్నాయి. ఏపీ ప్రభుత్వం ఏప్రిల్ 1 వరకు అనుమతి పొందిన ప్రాజెక్టుల్లో ఇంకా ప్రారంభం కాని వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యం జీవో జారీ చేశారు. దీని ప్రకారం టెండర్లు పూర్తయి పనులు ప్రారంభమైన వాటిలో ప్రాజెక్టు వ్యయం దాని అంచనా విలువలో 25 శాతం కన్నా తక్కువ ఉంటే అవి కూడా నిలిచిపోతాయి. వీటికి మళ్లీ టెండర్లు పిలవాల్సి ఉంటుంది. ఏపీ ప్రభుత్వపు తాజా నిర్ణయంతో ఆంధ్రాకి చెందిన ఎన్‌సీసీ కంపెనీపై ప్రతికూల ప్రభావం పడనుంది. ఈ కంపెనీ ఫిబ్రవరి-మార్చి మధ్య కాలంలో రూ.8,707 కోట్ల విలువైన కొత్త ఆర్డర్ల లభించాయి. వీటిల్లో సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న నేటి నిర్ణయం కారణంగా ఈ కంపెనీ షేరు ధర భారీగా కుప్పకూలింది.