జూన్ 19న లోక్ సభ స్పీకర్ ఎన్నిక

SMTV Desk 2019-06-01 12:13:02  Loksabha,

కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో మరికొన్నిరోజుల్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ఖరారైంది. కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని నూతన మంత్రిమండలి తొలిసారి సమావేశమైంది. ప్రధాని కార్యాలయంలో మోడీ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మొత్తం 58 మంది సభ్యులు పాల్గొన్నారు. జూన్ 17 నుంచి జూలై 26 వరకు పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జూన్ 19న లోక్ సభ స్పీకర్ ను ఎన్నుకోనున్నారు.