మహేశ్ ఫ్యాన్స్ కోసం...... ప్రామిస్ చేస్తున్నాను: దేవిశ్రీ ప్రసాద్

SMTV Desk 2019-06-01 11:33:35  devi sri prasad

మహేశ్ బాబు .. అనిల్ రావిపూడి కాంబినేషన్లోని సరిలేరు నీకెవ్వరు సినిమా, ఈ రోజు ఉదయమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమా సంగీత దర్శకుడైన దేవిశ్రీ ప్రసాద్ కూడా ఈ వేడుకకి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .. మహర్షి విజయోత్సవ వేడుక జరుపుకుంటూ కొత్త ప్రాజెక్టులోకి ఎంటరవుతున్నందుకు సంతోషంగా వుంది. మహర్షి తరువాత మహేశ్ సినిమా ఆయిన సరిలేరు నీకెవ్వరు లోను నాకు ఛాన్స్ లభించడం ఆనందంగా వుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కామెడీతో పాటు యాక్షన్ .. ఎమోషన్ కూడా ఉంటాయి. మహేశ్ అభిమానులు తమ హీరోకి ఒక మాస్ మసాలా సాంగ్ ఇవ్వమని అడుగుతున్నారు. ఈ సినిమాతో ఆ ముచ్చట తీరుస్తాను. ఇక రొమాంటిక్ సాంగ్స్ కూడా ఒక రేంజ్ లో వుంటాయని ప్రామిస్ చేస్తున్నాను" అని అన్నారు.