టీడీపీకి అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు లేవా? : లక్ష్మీపార్వతి

SMTV Desk 2017-08-28 16:38:02  Nandyala by-polls results, Lakshmi Parvathi, Election Results, Fire On TDP, Nandyala by-election

నంద్యాల, ఆగస్ట్ 28: నంద్యాలలో టీడీపీ విజయంపై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి స్పందిస్తూ... ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్రంలో ఇతర ప్రాంతాలు లేవా? ఈ ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టడానికే హడావుడిగా భారీ ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టారంటూ ఆమె టిడిపిపై నిప్పులు చెరిగారు. ఉపఎన్నికల విజయానికి మొత్తం రూ. 200 కోట్లు చంద్రబాబు ఖర్చుచేశారంటు అమె విమర్శించారు. ఈ ఎన్నికలు కేవలం ఉప ఎన్నిక మాత్రమేనని... సార్వత్రిక ఎన్నికలు కాదని ఆమె హెద్దెవ చేశారు. మూడున్నరేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయని ప్రభుత్వానికి ఉపఎన్నికల కారణంగా నంద్యాల గుర్తు వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.