డిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో నరేంద్రమోడీ ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ఆయన తరువాత వరుసగా రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కారీ, నిర్మలా సీతారామన్, రవి శంకర్ ప్రసాద్, హరిసిమ్రత్ కౌర్ బాదల్, రమేశ్ పోక్రియాల్, అర్జున్ ముండా, స్మృతీ ఇరానీ, డాక్టర్ హర్షవర్ధన్, ప్రకాష్ జావ్డెకర్, ధర్మేంద్ర ప్రధాన్,ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ప్రహ్లాద్ జోషి, డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే, అరవింద్ గణపత్ సావంత్, గిరిరాజ్, సంతోష్ కుమార్ గంగ్వార్ తదితరులు వరుసగా ప్రమాణస్వీకారం చేసారు .
మోడీ మంత్రివర్గంలో సికిందరాబాద్ బిజెపి ఎంపీ కిషన్రెడ్డికి స్థానం లభించింది. ఈ నేపథ్యంలో ఆయన ప్రమాణస్వీకారం చేశారు.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి దేశవిదేశాల నుంచి అనేకమంది ప్రముఖులు తరలివచ్చినందున భద్రతా కారణాల రీత్యా ఈ కార్యక్రమం ముగిసేవరకు డిల్లీ గగనతలంలో విమానాలపై ఆంక్షలు విధించడంతో, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు. కనుక సిఎం కేసీఆర్ విజయవాడ నుంచి మళ్ళీ హైదరాబాద్ తిరిగి వచ్చేశారు.