రూ. 50 వేలు ఆర్థిక సాయం అందించిన రేవంత్ రెడ్డి

SMTV Desk 2019-05-31 12:03:45  revanth reddy

వీధి కుక్కల దాడిలో మౌలాలికి చెందిన సక్లెన్ అలీ అనే బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గత రెండు రోజులుగా ఆ సక్లెన్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. నేడు ఆ బాలుడిని మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలుడి కుటుంబానికి రూ. 50లను సాయంగా అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ, వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ పట్టన్టు వ్యవహరించడం సరికాదన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు రేవంత్ సూచించారు.