భారీ మెజార్టీతో టీడీపీ విజయం... నంద్యాల పసుపుమయం

SMTV Desk 2017-08-28 13:31:44  TDP, YSRCP, Nandyala by-polls Results, By-Elections, Winning party

నంద్యాల, ఆగస్ట్ 28: నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డి 27,466 ఓట్ల భారీ మెజార్టీ‌తో ఘన విజయం సాధించారు. ఈ ఉపఎన్నికల్లో అధికార పక్షానికి చెందిన టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డికి 97,076 ఓట్లు, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డికి 69,610ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 1,382 ఓట్లు వచ్చాయి. కాగా, మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజ్ గోపాల్ సర్వేలో వెల్లడైన విధంగానే టీడీపీ విజయాన్ని చేజిక్కించుకుంది. నంద్యాల నియోజక వర్గం అంతా పసుపు వర్ణం పులుముకుంది. పలువురు తెదేపా శ్రేణులు దీనిపై స్పందిస్తూ... వైసీపీ అధినేతకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత జగన్, వైసీపీ ఎమ్మెల్యే రోజా వారి మాట రు మార్చుకోవాలంటూ సూచనలు చేస్తున్నారు.