16వ రౌండ్ లో అధిక్యం కనబరిచిన వైసీపీ

SMTV Desk 2017-08-28 13:05:12  TDP, YSRCP, Nandyala by-polls Results, By-Elections

నంద్యాల, ఆగస్ట్ 28: నంద్యాలలో టీడీపీ, వైసీపీల మధ్య పోరులో ఇప్పటి వరకు పూర్తయిన 15రౌండ్ లలో వరుస ఆధిక్యం కనపరుస్తున్న టీడీపీ, 16వ రౌండ్ లో కాస్త తడబడింది. 16వ రౌండ్ లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మనంద రెడ్డికి 4,663 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి శిల్పాకు 5,317ఓట్లు పోలయ్యాయి. దీంతో 16వ రౌండ్‌లో 654ఓట్ల ఆధిక్యంలో వైసీపీ నిలిచింది. కాగా, ప్రస్తుతం 25,078ఓట్ల భారీ మెజార్టీతో టీడీపీ దూసుకుపోతుంది.