ఉత్తర నైజీరియాలో బంధిపోటుల దాడి....23 మంది హత్య

SMTV Desk 2019-05-30 18:51:47  north nigeria

అబూజ: బుధవారం ఉత్తర నైజీరియాలో బంధిపోటు దొంగలు రెచ్చిపోయారు. రెండు గ్రామాలపై మెరుపుదాడికి దిగి ప్రజల వద్ద నుంచి అందినకాడికి దోచుకెళ్లారు. అనంతరం 23 మందిని హత్య చేసి పలాయనమయ్యారు. ఎస్పీ మహ్మద్‌ శేషు వెల్లడించిన వివరాల ప్రకారం...తుంగ, కబాజే గ్రామస్థులు అల్పాహారం తీసుకుంటున్న సమయంలో బంధిపోటు దొంగలు బీభత్సం సృష్టించారు. దొంగల దాడిలో 23 మంది మృతిచెందారు. పాత కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగినట్టు ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు. దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలిపారు.