సౌథాంప్టన్: మరికొద్ది గంటల్లో ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో టీంఇండియా ఆటగాళ్లు గతరాత్రి సౌథాంప్టన్ చేరుకున్నారు. ఓవల్ వేదికగా తొలిపోరులో ఆతిథ్య ఇంగ్లాండ్.. దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇక టీమిండియా తొలి మ్యాచ్ జూన్ 5న దక్షిణాఫ్రికాతో సౌథాంప్టన్ వేదికగా ఆడనుంది. కాగా మంగళవారం బంగ్లదేశ్తో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లో 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్లోకి ఘనంగా అడుగుపెట్టబోతోంది.